News October 31, 2024
సర్దార్ వల్లభాయ్ పటేల్కు పోలీసుల నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాపోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News November 9, 2025
వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.
News November 9, 2025
ప్రకాశం జిల్లాకు CM రాక.. కారణమిదే!

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు 11న రానున్నారు. పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పీసీపల్లి మండలం లింగన్నపాలెం సమీపంలో 20 ఎకరాల భూమిలో రూ. 7కోట్లతో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేశారు. దీనిని నిర్మాణానికి గత నెల కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి కావడంతో దీనిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
News November 9, 2025
ఒంగోలు: మీరు వెళ్లే బస్సు బాగుందా? లేదా?

వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. చాలా వాటిపై కేసులు నమోదు చేశారు. స్కూళ్లు, కాలేజీ బస్సుల పనితీరుపైనా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీంతో సంతనూతలపాడు పోలీస్లు శనివారం ప్రైవేట్ స్కూల్ బస్సులను చెక్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? అని తీశారు. మీరు వెళ్లే స్కూల్/కాలేజీ బస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


