News April 2, 2025

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళి

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Similar News

News September 15, 2025

MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

image

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

MBNR: పొలం విరాసత్ చేయడం లేదని రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

image

ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన MBNR జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకద్ర(M) బస్వాయపల్లి వాసి శంకర్ పొలం విరాసత్ కోసం 5ఏళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయినా పని కాలేదు. ఈరోజు ఆటోలో భార్య, ఇద్దరు పిల్లలతో MBNR వచ్చి పెట్రోల్ పోసుకొని కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన స్థలానికి RDO నవీన్ చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News September 15, 2025

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించండి: KMR కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల వల్ల నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళీ, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.