News February 7, 2025
సర్పంచ్ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లా వివరాలు

గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో జిల్లాలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఇప్పటినుంచి తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC- 27, MPP-27, ఎంపీటీసీ- 276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276 కు తగ్గించారు. జెడ్పిటిసిలు 25 నుంచి 27 కు పెరిగాయి. గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
Similar News
News January 8, 2026
పాలమూరు: ట్రాక్టర్ కిందపడి యువకుడి స్పాట్డెడ్

ఊర్కొండ మండల పరిధిలోని మంధారంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం వెళ్లిన శివయ్య (25) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. కరిగేట దున్నుతుండగా అదుపుతప్పి ట్రాక్టర్ కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు శవమై తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణదేవ తెలిపారు.
News January 8, 2026
స్పర్శిస్తూ కళను అనుభూతి చెందుతున్నారు!

కళను కళ్లతో చూడడమే కాదు చేతులతో తాకి అనుభూతి చెందవచ్చని నిరూపిస్తోంది జైపూర్లోని(RJ) ‘రాజస్థాన్ నేత్రహీన్ కళ్యాణ్ సంఘ్’. St+art ఫౌండేషన్ చేపట్టిన ‘స్పర్శ్’ ప్రాజెక్ట్ ద్వారా అంధ విద్యార్థుల కోసం గోడలపై ‘టాక్టైల్ ఆర్ట్’ను రూపొందించారు. బ్రెయిలీ లిపి, టెక్స్చర్డ్ పెయింట్స్తో తీర్చిదిద్దిన ఈ చిత్రాలను స్పర్శిస్తూ అంధ విద్యార్థులు రాజస్థాన్ సంస్కృతిని అనుభూతి చెందుతున్నారు.
News January 8, 2026
పున్నమి ఘాట్లో ఘనంగా నదీ హారతి

భవానిపురం పున్నమిఘాట్కు CM చంద్రబాబు గురువారం విచ్చేశారు. యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్తో కలిసి ఆయన ‘శ్రీ కృష్ణవేణి నది హారతి’ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేశ్, ఉన్నతాధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను సందర్శించి, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. నదీ తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.


