News February 1, 2025
సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం
కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
Similar News
News February 1, 2025
కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలుంటే తమకు తెలపాలని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
News February 1, 2025
విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ దుర్మరణం
కర్నూలు(D) గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గోనెగండ్ల గ్రామానికి చెందిన బోయ రంగస్వామి (46) ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.
News February 1, 2025
నిర్మలమ్మ పద్దుపై కర్నూలు ప్రజల ఆశలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై కర్నూలు జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కర్నూలు-మంత్రాలయం కొత్త లైన్, కర్నూలు నుంచి అమరావతికి నేరుగా రైలు సౌకర్యం, రిహాబిలిటేషన్ వర్క్షాపు పూర్తి కోసం నిధుల కేటాయింపుపై ప్రజలు ఆశలుపెట్టుకున్నారు. ఇక ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు రైల్వే లైన్పై ప్రకటన ఉంటుందో? లేదో? వేచి చూడాలి.