News February 1, 2025
సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
Similar News
News December 6, 2025
ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: సూర్యాపేట కలెక్టర్

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఆయన వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, మెటీరియల్ పంపిణీ, కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలను 37ఏ, 37సీ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
News December 6, 2025
సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు ఇవ్వండి: మంత్రి అచ్చెన్నాయుడు

దేశ రక్షణలో అమరులైన, విధీ నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరు ఉదారంగా విరాళాలు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన ముందుగా విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, రవికుమార్, కలెక్టర్ పాల్గొన్నారు.
News December 6, 2025
సూర్యాపేట: ఎన్నికల ఫిర్యాదులకు ఐఏఎస్ అధికారి ప్రత్యేక నంబర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి రవి నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ఎన్నికల ఉల్లంఘనలు లేదా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి ఆయన ఒక ప్రత్యేక ఫోన్ నంబర్ను ప్రకటించారు. 9676845846 జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


