News February 1, 2025

సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్‌లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.

Similar News

News October 22, 2025

రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అటు భారీ వర్షసూచన నేపథ్యంలో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

News October 22, 2025

ఆసియా కప్‌ను నేనే ఇస్తా: మోహ్సిన్ నఖ్వీ

image

ఆసియా కప్‌ను భారత్‌కు తానే అప్పగిస్తానని ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని నఖ్వీకి BCCI లేఖ రాసింది. ‘ఒక వేడుక ఏర్పాటు చేస్తాం. BCCI ఆఫీస్ హోల్డర్, విన్నింగ్ టీమ్‌లో అందుబాటులో ఉన్న ఏ ప్లేయర్‌తోనైనా వచ్చి ట్రోఫీ కలెక్ట్ చేసుకోండి’ అని నఖ్వీ చెప్పినట్లు GEO న్యూస్ పేర్కొంది. ఈ విషయాన్ని ICC వద్దే తేల్చుకోవాలని BCCI ఫిక్సైనట్లు తెలుస్తోంది.

News October 22, 2025

రైళ్ళ రాకపోకలు ఆలస్యం: SCR

image

పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడవనున్నట్లు SCR పేర్కొంది.
T.No.12722 HYD దక్షిణ్ 10.30Hrs
T.No.12648 కొంగు SF 2.40Hrs
T.No.12628 కర్ణాటక SF 9.45Hrs
T.No.12486 నాందేడ్ SF 10Hrs
T.No.12804 స్వర్ణ జయంతి SF రైళ్లు కొన్ని గంటల పాటు నేడు PDPL మీదుగ ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే, రైల్వే ప్రయాణికులు గమనించాలని ఓ ప్రకటనలో సూచించారు.