News February 21, 2025

సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం కలకలం

image

సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామానికి చెందిన కొందరు రైతులు గేదెల కోసం పొలాల వద్దకు వెళ్లగా సర్వేపల్లి కాలువలో గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం కొట్టుకుపోతుండగా గమనించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. చీకటి పడడంతో మృతదేహం ఆచూకీ తెలయలేదు. మహిళ ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, లేక సూసైడ్ చేసుకుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 2, 2025

నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

image

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.

News December 2, 2025

నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

image

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.

News December 2, 2025

నెల్లూరు: అసాంఘిక శక్తుల నివారణకు SP కార్యాచరణ

image

నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఈ దూరాన్ని తగ్గించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకొస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే.. 112 కి, ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు గంజాయి, సైబర్ నేరాలు, ఇసుక అక్రమ రవాణా వంటి ఇతరత్రా నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.