News December 28, 2024

సర్వే ఆధారంగా కచ్చితమైన నివేదికలు ఇవ్వాలి: కలెక్టర్

image

సముద్ర తీరా ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నాయనే అంశంపై జియో కో-ఆర్డినేట్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితంగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జల శాఖ, మత్స్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆక్వా చెరువుల అనుమతులపై వివరాలు తెలుసుకున్నారు

Similar News

News January 13, 2025

పిఠాపురంలో 389 బైండోవర్ కేసులు

image

పిఠాపురం నియోజవర్గంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో 389 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. పేకాట, కోడిపందేలు నిర్వహిస్తారన్న  సమాచారంతో రెండు కోళ్లు, రూ. 24 వేల నగదు స్వాధీన పరుచుకొని 14 మందిని అరెస్టు చేశామన్నారు. కోడిపందేలు జరిగే ప్రాంతాలను గుర్తించి 35 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

News January 13, 2025

తూ.గో: నేడు, రేపు రైళ్లు రద్దు

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం, మంగళవారం ఏర్పాటు చేసిన కాకినాడ టౌన్-చర్లపల్లి, చర్లపల్లి- కాకినాడ టౌన్ మధ్య రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ రెండు రైళ్లకు తగిన ప్రయాణికులు లేకపోవడంతో వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

News January 13, 2025

తూ.గో: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.