News April 12, 2025

సళేశ్వరం జాతరలో పోలీసులకు సహకరించాలి: అచ్చంపేట డీఎస్పీ 

image

అమ్రాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని శ్రీ సళేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు పోలీసు అధికారులకు సహకరించాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలిరానున్నారన్నారు. భక్తులు స్వామివారి దర్శనం అనంతరం అక్కడ సేద తీరకుండా ఇతర భక్తులకు అవకాశం కల్పించేందుకు వెంటనే తిరుగు ప్రయాణం కావాలని సూచించారు.

Similar News

News April 13, 2026

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. 7 ప్రాంతాలు ఎల్లో జోన్ లో ఉండగా మిగతా ప్రాంతాలన్నీ 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎల్పుగొండ, బిచ్కుంద, బొమ్మన్ దేవిపల్లిలో 41.6°C, మాచాపూర్, మేనూర్ 41.5, కొల్లూరు 41.4, పిట్లం 41.3, లింగంపేట, మాక్డూంపూర్, నాగిరెడ్డిపేట 41.2, IDOC(కామారెడ్డి), దోమకొండ 41.1°C నమోదయ్యాయి.

News April 13, 2026

తిరుపతి: వేధించిన అధికారి సరెండర్..!

image

తిరుపతి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయ ఉద్యోగినిని ఏపీసీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉన్న పోస్టు అర్హతను ప్రభుత్వం మార్చింది. దీంతో ఆ ఉద్యోగి డిప్యుటేషన్‌పై ఈ శాఖలోకి వచ్చాడు. అక్కడే పనిచేసస్తున్న ఓ ఉద్యోగిని ఆయనపై వేధింపుల ఆరోపణలు చేయగా.. విచారణలో నిజమని తేలింది. దీంతో ఏపీసీని కలెక్టర్‌‌కు సరెండర్ చేశారు.

News April 13, 2026

భూపాలపల్లి: ఆశగా ఎదురుచూస్తున్న 18వేల మంది యువత..!

image

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులకు తప్ప అమలుకు నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఏడాది గడిచినా అమలుకు శ్రీకారం చుట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి పథకం అమలు చేయాలని యువత కోరుతున్నారు.