News April 12, 2025

సళేశ్వరం వెళ్లేవారు ప్లాస్టిక్ వాడొద్దు: నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో

image

సళేశ్వరం వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిడి సూచించారు. ATRను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా వన్యప్రాణులకు హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2 లీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ వాటర్, కూల్ డ్రింక్ బాటిల్స్ నిషేధం అన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

Similar News

News November 21, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 11

image

62. డంభం అంటే ఏమిటి? (జ.తన గొప్ప తానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (జ.తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (జ.ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (జ.ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (జ.మైత్రి)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 21, 2025

కగార్ ఎఫెక్ట్.. కలిసిపోతారా..? కొనసాగుతారా..?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి కరీంనగర్(D) మంథని ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లా రాజిరెడ్డి @ సత్తెన్న సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన హిడ్మా ఎన్కౌంటర్, అనారోగ్యంతో పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం సాగిస్తరా? అనేది చూడాలి.

News November 21, 2025

శబరిమలై యాత్రికుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: డీటీవో

image

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డ్రైవర్లు మెళకువలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. శబరిమలై యాత్రికులతో ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు జిల్లా నుంచి తరలి వెళ్తున్నందున డ్రైవర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. మంచు కురిసే సమయాల్లో డ్రైవింగ్ చేయవద్దని, సుదూర ప్రయాణాల్లో తప్పనిసరిగా వాహనంలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని ఆయన ఆదేశించారు.