News April 12, 2025

సళేశ్వరం వెళ్లేవారు ప్లాస్టిక్ వాడొద్దు: నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో

image

సళేశ్వరం వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిడి సూచించారు. ATRను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా వన్యప్రాణులకు హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2 లీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ వాటర్, కూల్ డ్రింక్ బాటిల్స్ నిషేధం అన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

Similar News

News November 23, 2025

డీసీసీ అధ్యక్ష పదవికి పర్వతగిరికి మొండి చేయి!

image

కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి పర్వతగిరికి మొండి చేయి దక్కింది. మండలం నుంచి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ బొంపల్లి దేవేందర్ రావు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరి దారుల్లో వారు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, తీరా ఇతరులకు దక్కడంతో ఉసూరుమన్నారు. పర్వతగిరి వాసులు సైతం మండలానికి డీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించారు.

News November 23, 2025

MBNR:U-17,19..24న వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల,బాలికలకు వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలను ఈనెల 24న MBNRలోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో (U-19) బోనఫైడ్,ఆధార్, నాలుగు ఎలిజిబిటి పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీ అఫ్ రోజ్ (80199 70231)కు రిపోర్ట్ చేయాలన్నారు.

News November 23, 2025

బాపట్ల: 2.50 లక్షల గోనె సంచులు సిద్ధం

image

ధాన్యం సేకరణలో రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. 1,200 వాహనాలు అవసరం కానున్నాయని అంచనా వేశామన్నారు. ఇప్పటికే 450 వాహనాలు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని, ప్రతి వాహనానికి జిపిఎస్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. 2.50 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉంచామన్నారు. మిల్లర్ల వద్ద మరో 10లక్షల గోనె సంచులు ఉన్నాయన్నారు.