News September 27, 2024

‘సాంకేతికతతో మెరుగైన ఉపాధి అవకాశాలు’

image

ప.గో జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లబ్ధిదారులకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంలో సాంకేతికత, సౌర విద్యుత్‌ను వినియోగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్‌ అండ్‌ వాటర్‌, న్యూఢిల్లీ (సీఇఇడబ్ల్యూ) ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

Similar News

News October 23, 2025

మండవల్లి: షార్ట్ సర్క్కూట్‌తో ఎలక్ట్రీషయన్ మృతి

image

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటి‌కే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

News October 23, 2025

3,800 దరఖాస్తులు పెండింగ్‌పై జేసీ రాహుల్‌రెడ్డి ఆగ్రహం

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్‌పీఎం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి రీ-సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పీజీఆర్ఎస్ పిటిషన్ల పరిష్కారాలపై ఆయన గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇంకా 3,800 జాయింట్ ఎల్‌పీఎంలు పెండింగ్ ఉండటంపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

News October 23, 2025

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ పట్టణంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్ల మార్జిన్‌లో, లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.