News March 21, 2025

సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు: పల్నాడు SP

image

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన సేవలందించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నూతన చట్టాలపై అవగాహన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించిన కానిస్టేబుళ్లు ఉన్నారని అన్నారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు.

Similar News

News November 27, 2025

ఫైబర్ ఎంత తీసుకోవాలంటే..

image

మన శరీరానికి పీచు తగిన మొత్తంలో అందితేనే ఆకలి, ట్రైగ్లిజరాయిడ్స్‌ అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువ. దంపుడు బియ్యం, గోధుమ, జొన్న, సజ్జ రవ్వలు, ఓట్స్, రాజ్మా, శనగల నుంచి ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజులో 25-48గ్రా. వరకూ పీచు కావాలి. ఎత్తు, బరువు, అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు.

News November 27, 2025

ADB: మూడు నెలల్లో నలుగురు గర్భిణుల మృతి

image

వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక గర్భిణుల మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత మూడు నెలల్లో సిరికొండలో ఏత్మబాయి, ఇచ్చోడ‌లో అనురాధ, గుడిహత్నూర్‌లో రుక్మాబాయి, ఆమె బిడ్డ, రోడ్డు, సిగ్నల్ సరిగా లేక సోమవారం ఉట్నూర్‌లో జంగుబాయి, ఆమె బిడ్డ మృతి చెందారు. గిరిజనులకు కనీస సౌకర్యాలు అందించకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

News November 27, 2025

ఉదయగిరి: విద్యార్థిని చితకబాదిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు

image

ఉదయగిరి బాలాజీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థిపై నిర్వాహకుడు అంజయ్య వాతలు పడేలా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. కలిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఆరో తరగతి నవోదయ ప్రవేశానికి ముందస్తుగా ఈ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటూ ఇక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు, నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. అనంతరం వారు విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు.