News May 11, 2024
‘సాగర్’లో భారీగా తగ్గిపోతున్న జలాలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. శనివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను, 123.0122 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో లేదని, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు కొనసాగుతోందని తెలిపారు.
Similar News
News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న నల్గొండ

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవాలకు నల్గొండ ముస్తాబైంది. పల్లెపల్లెనా, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీలు తీసేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఉంటుందని హిందూవాహినీ సభ్యులు తెలిపారు. రామగిరి రామాలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News February 19, 2025
శ్రీలత రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే!

BJP జిల్లా పార్టీ పగ్గాలు తొలిసారి మహిళ చేతిలోకి వెళ్లాయి. జిల్లా అధ్యక్షురాలిగా నేరేడుచెర్లకు చెందిన శ్రీలతరెడ్డిని అధిష్ఠానం నియమించింది. 2019లో BRSతో రాజకీయప్రస్థానం మొదలుపెట్టిన ఈమె నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్గా పనిచేశారు. 2023లో MP ఈటల సమక్షంలో BJPలో చేరి HNR నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ BJPలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
News February 19, 2025
శ్రీలత రెడ్డికి సూర్యాపేట బీజేపీ పగ్గాలు!

BJP జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా ఆమె పేరును మంగళవారం ప్రకటించింది. నేరేడుచర్లకు చెందిన శ్రీలతరెడ్డి 2023లో BRS నుంచి BJPలో చేరి హుజుర్నగర్ నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే NLG జిల్లా BJP అధ్యక్షుడిగా వర్షిత్రెడ్డి, యాదాద్రిభువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్ని పార్టీ నియమించిన విషయం తెలిసిందే.