News April 11, 2025
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
Similar News
News October 16, 2025
క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.
News October 16, 2025
గుజరాత్ మంత్రులంతా రాజీనామా

గుజరాత్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
News October 16, 2025
23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ: కలెక్టర్

విద్యార్థుల ఆధార్ నవీకరణకు ఈనెల 23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 కేంద్రాలు పని చేయడంతో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.