News January 12, 2025
సాగర్ జి ఆత్మకథను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది: సీఎం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు (సాగర్ జీ) ఆత్మకథను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సాగర్ జీ ఆత్మకథ పుస్తకం ఉనికను ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ ఉనికిని దేశ స్థాయిలో చాటిన కొద్ది మంది ప్రముఖుల్లో CH.విద్యాసాగర్ రావు ఒకరని, ఆయన ఆత్మ కథను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని సీఎం తెలిపారు.
Similar News
News February 8, 2025
హుజూరాబాద్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్లోని ఇందిరానగర్లో జరిగింది. పోలీసులా కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News February 7, 2025
కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
News February 7, 2025
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.