News August 7, 2024

సాగర్ డ్యామ్ సందర్శించిన రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్

image

రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, CCAL నవీన్ మిట్టల్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యాంను సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి  పారుతున్న నీటిని, సాగర్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సీసీఎల్ఏ కార్యాలయ అధికారి లచ్చిరెడ్డి, ధరణి కమిటీ రాష్ట్ర సభ్యులు భూమి సునీల్, డీఎఫ్ఓ రాజశేఖర్ ఉన్నారు.

Similar News

News September 19, 2025

NLG: వ్యవసాయాధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

నిడమనూరు మండల వ్యవసాయ అధికారి ముని కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. యూరియా కోసం రైతులు గురువారం నిడమనూరులో 2 గంటలకు పైగా కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో సమయంలో వ్యవసాయాధికారి స్థానికంగా అందుబాటులో లేడన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 19, 2025

NLG: ఉపాధ్యాయుల సర్దుబాటు.. రిలీవ్‌కు అదేశాలు

image

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జిల్లా విద్యాశాఖలో 125 మంది ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ తదితర ఉపాధ్యాయులను కలెక్టర్ అనుమతితో డీఈఓ బిక్షపతి సర్దుబాటు చేశారు. వారందరినీ సంబంధిత పాఠశాలలో వెంటనే విధుల్లో చేరాలని సంబంధిత హెచ్ఎంలు వారిని రిలీవ్ చేసేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 18, 2025

నల్లగొండ : పత్తి కొనుగోలుకు సన్నాహాలు

image

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈసారి 5,67,613 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా సుమారు 4,54,090 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 7పత్తి కేంద్రాల కింద 24 పత్తి మిల్లులు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిపై చేయనున్నారు.