News February 11, 2025

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పై కలెక్టర్ సమీక్ష

image

నాగర్ కర్నూల్ సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరెట్‌లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ పై ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, బీమా ప్రాజెక్టు భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 20, 2025

జూబ్లీహిల్స్‌లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.

News October 20, 2025

రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు గద్వాల బిడ్డ కెప్టెన్

image

గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ నందిన్నెలో చదువుతున్న మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైంది. దీంతో ఆమెను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, పీఈటీ అమ్రేష్ బాబు, తల్లిదండ్రులు అభినందించారు. మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News October 20, 2025

KMR: RTA చెక్‌పోస్ట్‌లపై ACB మెరుపు దాడి (UPDATE)

image

అవినీతి పాల్పడుతున్న అధికారుల గుండెల్లో ACB రైళ్లను పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలం సలాబత్పూర్ RTA చెక్‌పోస్ట్‌పై దాడి జరిపిన ACB అధికారులు రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, బిక్కనూర్ పొందుర్తి చెక్‌పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి రూ.51,300 స్వాధీనం పరుచుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఈ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడి జరగడం గమనార్హం.