News December 1, 2024
సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో డిసెంబర్ 8న ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడుతుందని తెలిపారు.
Similar News
News February 18, 2025
గుండెపోటుతో దేవనకొండ హెచ్ఎం మృతి

దేవనకొండ మండల కేంద్రంలోని ఎంపీపీ స్కూల్లో (మెయిన్) విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం పద్మావతి సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దేవనకొండలో బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె భర్త రఘునాథ్ తెలిపారు. ఈ ఘటనతో దేవనకొండలో విషాదఛాయలు అమలుకున్నాయి. ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు.
News February 18, 2025
టైరు పేలి టాటా ఏస్ బోల్తా

వెల్దుర్తి మండల సమీపంలోని అల్లుగుండు పెట్రోల్ బంక్ దగ్గర నేషనల్ హైవేపై మంగళవారం టైరు పేలి టాటా ఏస్ బోల్తా పడింది. కర్నూలు మార్కెట్కు వేరుశనగ కాయలు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్తో సహా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News February 18, 2025
కర్నూలు జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే కర్నూలులో ఆదివారం, సోమవారం వరుసగా 38.2, 38°C ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.