News March 16, 2025

సాగు, తాగు నీటికి ఆటంకాల్లేని నిరంతర విద్యుత్: మంత్రి

image

బత్తలపల్లె మండలం అప్పరాచెరువులో రూ.1.62 కోట్లతో అప్ గ్రేడ్ చేసిన 11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా అప్పరాచెరువు, చెన్నపట్నం, జ్వాలాపురం గ్రామాలకు త్రీ ఫేజ్ నిరంతర విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. సాగు, తాగు నీటికి ఆటంకాల్లేని విద్యుత్ అందుతుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలు తీర్చాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 10, 2025

తలరాతను మార్చే క్రమంలో చిగురించిన ప్రేమ..!

image

బిహార్‌లో సినిమా కథను తలపించే ఘటన జరిగింది. రైళ్లలో యాచిస్తున్న అనాథ బాలికను చూసి ఒక యువకుడు చలించిపోయాడు. ఆమె తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో శ్రమించి ఆమె కుటుంబ మూలాలను కనుగొని విడిపోయిన వారికి దగ్గర చేశాడు. మానవత్వంతో మొదలైన ఈ ప్రయాణంలో వారి మధ్య పెరిగిన విశ్వాసం ప్రేమగా మారింది. రైల్వే ప్లాట్‌ఫారమ్ నుంచి మొదలైన వారి ప్రయాణం తాజాగా వివాహ బంధంగా మారి ముందుకు సాగుతోంది.

News December 10, 2025

వరంగల్ ఓటర్లూ.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

ఉమ్మడి WGLలో రేపు మొదటి విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు కాల్ చేసి అలెర్ట్ చేస్తున్నారు. ఛార్జీలు పంపించాం, నేటి రాత్రికే ఇంటికి రావాలని మెసేజ్‌లు పెడుతున్నారు. కుటుంబీకులకు సైతం కాల్స్ చేసి మీపిల్లలను రమ్మని చెప్పాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలువురు ఓటర్లకు డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

News December 10, 2025

స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో రేపు(గురువారం) నిర్వహించనున్న మొదటి విడత పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వినియోగించుకోవాలన్నారు. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.