News January 24, 2025
సాతర్లలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

జోగులాంబ గద్వాల జిల్లాలో హెచ్చుతగ్గు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మొన్నటి వరకు చలి తీవ్రత పెరిగిన.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటలలో సాతర్లలో 15.4 డిగ్రీలు, చిన్న తాండ్రపాడులో 15.6 డిగ్రీలు, బూడిదపాడులో 15.9 డిగ్రీలు, వడ్డేపల్లి, తోతినొనిదొడ్డిలో 16.1 డిగ్రీలు, ధరూర్, జల్లాపూర్లో 17.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News October 28, 2025
సూర్య ఫామ్ లేమిపై ఆందోళన లేదు: గంభీర్

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య బ్యాటింగ్ ఫామ్పై ఆందోళన లేదని హెడ్ కోచ్ గంభీర్ తెలిపారు. ‘ఫియర్లెస్, అగ్రెసివ్గా ఆడాలన్నదే మా ఆలోచన. అలా ఆడినప్పుడు త్వరగా ఔటవ్వడం, మిస్టేక్స్ సహజం. 30 బంతుల్లో 40 రన్స్ చేస్తే విమర్శలకు దూరంగా ఉండొచ్చు. కానీ మా అప్రోచ్ అది కాదు. T20లకు కెప్టెన్గా సూర్య ఫర్ఫెక్ట్. జట్టును బాగా నడిపిస్తున్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. AUS, IND మధ్య తొలి T20 రేపు జరగనుంది.
News October 28, 2025
వరంగల్: లక్కీ డ్రాలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

నూతన మద్యం పాలసీ 2025-27 కింద మద్యం షాపుల కేటాయింపునకు గాను వరంగల్లోని ఉర్సుగుట్ట వద్ద నాని గార్డెన్లో డ్రా నిర్వహించారు. ఈ లాటరీలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్, ఆయన భార్య గంప సాంబలక్ష్మి విజేతలుగా నిలిచారు. వీరికి నర్సంపేట పరిధిలోని షాప్ నెంబర్ 5, 38 కేటాయించారు. లక్కీ డ్రాలో గెలవడం పట్ల దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
News October 28, 2025
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలు: మంత్రి

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశాం. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10-12% తగ్గిస్తుంది. భూసేకరణను సగానికి తగ్గిస్తుంది. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు ₹1,500-1,600Cr ఆదా చేస్తుంది’ అని చెప్పారు.


