News April 1, 2025
సామర్లకోటలో క్షుద్ర పూజలు కలకలం

సామర్లకోట శివారు బ్రౌన్ పేట కందకం ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం ఏర్పడింది. ఇంటి ముందు స్టార్ తరహాలో ముగ్గు వేసి, పసుపు, కుంకుమ మధ్యలో నిమ్మకాయలు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను వేధించేందుకు ఇలా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కొద్దిపాటి అనారోగ్యం వచ్చినా క్షుద్ర పూజల ప్రభావం అనే భావన ప్రజల్లో నెలకొంది.
Similar News
News January 10, 2026
48 డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పోస్టల్ డిపార్ట్మెంట్లో 48 కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అహ్మదాబాద్ ప్రాంతంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ పాసై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18నుంచి 27ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్ల్ సడలింపు ఉంది. నెలకు జీతం రూ.19,900-63,200 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.indiapost.gov.in/
News January 10, 2026
సకల సంపదలు ప్రసాదించే సంపత్కరీ దేవి

లలితాదేవి గజ దళానికి అధిపతి అయిన సంపత్కరీ దేవి భక్తులకు ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను అనుగ్రహించే కరుణామయి. అంకుశ స్వరూపిణి అయిన ఈ తల్లి, ఏనుగు అహంకారాన్ని అణచినట్లుగా మనలోని అజ్ఞానం, అహంకారాన్ని తొలగిస్తుంది. ఎంతటి పేదరికంలో ఉన్నవారికైనా సౌఖ్యాలను, విజయాలను చేకూర్చడం ఈ దేవి ప్రత్యేకత. కణ్వ మహర్షి బోధించిన ఈ దేవిని నిత్యం ప్రార్థిస్తే శత్రువులపై విజయం, అంతులేని ఐశ్వర్యం, మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం.
News January 10, 2026
అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.


