News February 15, 2025
సామర్లకోట: రైలు ఎక్కుతూ యువకుడు మృతి

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన వాకాడ జాన్ బాబు (27) శనివారం ఉదయం సామర్లకోట రైల్వే స్టేషన్లో నూజివీడు వెళ్లేందుకు తన తండ్రి, భార్య, కుమారుడితో కలిసి ట్రైన్ ఎక్కుతుండగా జారి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అతని తండ్రి, భార్య నిశ్చేష్టులయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News March 15, 2026
అమలాపురం: బాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్లో దంపతుల విజయం

అమలాపురం బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ టోర్నమెంట్లో రాజమండ్రికి చెందిన దంపతులు తమ అద్భుత ప్రతిభతో విజేతలుగా నిలిచారు. రాజీ, విజయ్ జంట క్రీడా మైదానంలో ఒకరికొకరు చక్కని సమన్వయంతో ఆడి ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జట్టుగా ఆడి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం అక్కడి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
News March 15, 2026
టెన్త్ పరీక్షలకు పోలీసు బందోబస్తు సిద్ధం: ఎస్పీ

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం కోనసీమ జిల్లాలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
News March 15, 2026
కామారెడ్డి: 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు

రామారెడ్డి మండలం అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని DLPO శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో సన్మానాలు నిర్వహించామన్నారు.


