News March 20, 2025

సామర్లకోట : రైలు దిగుతూ జారి పడి వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురానికి చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మి విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి, ప్రమాదానికి గురయ్యాడు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 26, 2025

సెలక్టర్లపై కైఫ్ సంచలన ఆరోపణలు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావాలని కొందరు సెలక్టర్లు ఎదురుచూస్తున్నారని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేశారు. 2027 ODI వరల్డ్‌కప్ రేసు నుంచి వారిని తప్పించాలని భావిస్తున్నారని చెప్పారు. తమను జట్టు నుంచి తొలగించే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదని తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నారు. WC జరిగే సౌతాఫ్రికా పిచ్‌లపై అనుభవమున్న వారిద్దరూ కచ్చితంగా ఆడాలని అభిప్రాయపడ్డారు.

News October 26, 2025

HYD: వారి నెత్తుటితో తడిచిన నేల స్మరిస్తోంది

image

పాషా నరహరి అంటే ఇద్దరు కాదు.. ఒక్కరిగా ప్రజలకు గుర్తు. పేదల పక్షాన పోరాడిన ఈ మహణీయులు మంచాలలోని జాపాలలో జన్మించారు. వీరు పుట్టిన ఊరు చరిత్రలో నిలిచిలా భూస్వాములతో పోరాడారు. 1989లో ఇదే రోజున ఆ వీరులను గూండాలు కాపుగాసి లింగంపల్లి గేటు వద్ద కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. వారి నెత్తుటితో తడిచిన నేల ఇప్పటికీ వారిని స్మరించుకుంటోంది. నేడు వారి వర్ధంతికి ప్రజలు వారిని గుర్తుచేసుకుంటున్నారు.

News October 26, 2025

HYD: వారి నెత్తుటితో తడిచిన నేల స్మరిస్తోంది

image

పాషా నరహరి అంటే ఇద్దరు కాదు.. ఒక్కరిగా ప్రజలకు గుర్తు. పేదల పక్షాన పోరాడిన ఈ మహణీయులు మంచాలలోని జాపాలలో జన్మించారు. వీరు పుట్టిన ఊరు చరిత్రలో నిలిచిలా భూస్వాములతో పోరాడారు. 1989లో ఇదే రోజున ఆ వీరులను గూండాలు కాపుగాసి లింగంపల్లి గేటు వద్ద కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. వారి నెత్తుటితో తడిచిన నేల ఇప్పటికీ వారిని స్మరించుకుంటోంది. నేడు వారి వర్ధంతికి ప్రజలు వారిని గుర్తుచేసుకుంటున్నారు.