News February 10, 2025
సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. హైదరాబాదులో స్థిరపడ్డ ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకులు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్సకు దోహదపడ్డారు. ఆయన మరణ వార్త విని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Similar News
News February 14, 2026
ఏపీ బడ్జెట్.. రంగాల వారీగా

☛ విద్యుత్-రూ.13,934 కోట్లు, ☛ పరిశ్రమలు-₹3,161కోట్లు,
☛ రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టులు-₹13,546Cr,
☛ వీబీ జీ రామ్ జీ -₹8,365Cr, ☛ పోలవరం ₹6,105Cr
☛ తల్లికి వందనం ₹9,668Cr, ☛ మహిళా శిశు సంక్షేమం ₹4,581Cr
☛ గృహ నిర్మాణం-₹5,451Cr, ☛ ఎన్టీఆర్ వైద్య సేవ ₹4,000Cr
☛ జల్ జీవన్ ₹4,000Cr, ☛ స్వచ్ఛ్ భారత్ మిషన్ ₹1,037Cr, ☛ విశాఖ ఆర్థిక ప్రాంతానికి ₹28,000Cr , రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు ₹30,000Cr
News February 14, 2026
MGU: డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు ‘చివరి ఛాన్స్’

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 2011-12 నుంచి 2018-19 బ్యాచ్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు సి.ఓ.ఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి చివరి అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు తమ పెండింగ్ సబ్జెక్టుల పరీక్ష ఫీజును మార్చి 4 వరకు చెల్లించవచ్చు. రూ. 100 ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు గడువు ఉంది. ఇది వన్ టైమ్ ఛాన్స్ మాత్రమేనని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
News February 14, 2026
రూ.3.32లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868కోట్లుగా పేర్కొన్నారు. అమరావతికి రూ.6వేల కోట్లను కేటాయించారు.


