News February 14, 2025
సారంగాపూర్: పాముకాటుతో 18 నెలల బాలుడు మృతి

సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్కు చెందిన 18 నెలల విహాంత్ అనే బాలుడికి పాము కాటు వేయడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆరు బయట అక్కతో ఆడుకుంటున్న విహాంత్ను ఇంటి పక్కన ఉన్న పొద నుంచి వచ్చిన పాము కాటు వేసింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News November 29, 2025
నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు

1759: గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నౌలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా మరణం(ఫొటోలో)
2009: తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
News November 29, 2025
కామారెడ్డి: రాష్ట్ర స్థాయికి నామినేట్ అయిన 8 పాఠశాలలు

జిల్లా స్థాయిలో SHVR 2025-26 బెస్ట్ రేటింగ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలు ఎంపికైనట్లు డీఈవో రాజు తెలిపారు. రూరల్లో TSNR ZPHS బీబీపేట్, ZPHS బోర్లం, ZPHS ధర్మారావుపేట్, PS మహమ్మదాపూర్, PS శక్తి నగర్, UPS ఇస్సన్నపల్లి, అర్బన్లో సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డి, PS INC కామారెడ్డి స్కూల్స్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నామినేట్ అయినట్లు DEO పేర్కొన్నారు.
News November 29, 2025
GDP వృద్ధి.. దేశ పౌరులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త: CBN

2025-26 రెండో త్రైమాసికంలో దేశ GDP 8.2% వృద్ధి చెందడం ప్రతి పౌరుడికి ఉత్సాహాన్నిచ్చే వార్త అని CM CBN అన్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలిపిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యాల వైపు స్థిరంగా కొనసాగుతోందన్నారు. తాజా వృద్ధి తయారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు తదితర రంగాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.


