News April 18, 2025

సారంగాపూర్: యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

సారంగాపూర్ మండలం ధని శివారులో బైక్ ఢీకొట్టడంతో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ధని, జామ్ గ్రామాల మధ్య మతిస్థిమితం లేని వ్యక్తి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న నిశాంత్, గణేశ్‌కు గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే 8712659516ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 20, 2025

జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

image

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్‌కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.

News April 20, 2025

ఆత్మకూరు: ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్ 

image

ఆత్మకూరులో కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో గర్భంలోనే చనిపోయిన శిశువు తల, మొండెం వేరుచేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సర్జరీ చేసే చేసే క్రమంలో అనస్తీషియాను అర్హత లేని వ్యక్తులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

News April 20, 2025

తాండూరులో సోమవారం ప్రజావాణి

image

తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని సిబ్బంది నవీన్ తెలిపారు. గత వారం హాలిడే సందర్భంగా ప్రజావాణి రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో గతవారం కొందరు వ్యక్తులు హాలిడే అని తెలియక ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చినట్టు తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు.

error: Content is protected !!