News April 7, 2025
సారపాకకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి మహాపట్టాభిషేకం వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం సారపాక బీపీఎల్ ఐటీసీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ ఐటీసీ గెస్ట్ హౌస్కు చేరుకొని గౌరవ వందనం స్వీకరించారు.
Similar News
News April 22, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

∆} ఖమ్మంలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10, ఇంటర్ పరీక్షలు ∆} ముదిగొండలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} తల్లాడలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News April 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్లో 694 మందిపై కేసు నమోదు

ఖమ్మం: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 673 మందితో పాటు 21 మంది మైనర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెలలోని 20 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్లో 694 మందిపై కేసు నమోదు

ఖమ్మం: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 673 మందితో పాటు 21 మంది మైనర్ల డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలోని 20 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.