News February 12, 2025
సారవకోట: బాలికపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739323424290_50167910-normal-WIFI.webp)
సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక సోమవారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా తినుబండారాలు ఇచ్చి లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ విషయం తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. డిఎస్పీ డి.ప్రసాదరావు విచారణ చేపట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News February 12, 2025
శ్రీకాకుళం: మరణంలోనూ వీడని బంధం..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739291870687_52320538-normal-WIFI.webp)
యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.
News February 12, 2025
నందిగాం: హత్యకు గురైన తహశీల్దార్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739335180731_1128-normal-WIFI.webp)
నందిగాం గ్రామానికి చెందిన రమణయ్య విశాఖపట్నంలో తహశీల్దారు విధులు నిర్వహిస్తూ గతేడాది ఫిబ్రవరి 2న హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్గా నియామక పత్రం అందించారు.
News February 12, 2025
దళ్లవలస వీఆర్ఓ సస్పెన్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739329935504_1128-normal-WIFI.webp)
పొందూరు మండలం దళ్లవలస సచివాలయంలో వీఆర్ఓ జె.తవిటయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయన మీద ఆరోపణలు రావడంతో తహశీల్దార్ విచారించి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. గ్రామ సభలను నిర్లక్ష్యం, మ్యూటేషన్కు డబ్బులు అడగడం తదితర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడ్రోజులు క్రమశిక్షణ చర్యల కింద ఆర్టీవో కార్యాలయానికి సరెండర్ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.