News March 13, 2025
సారా తయారీపై డ్రోన్లతో నిఘా: కలెక్టర్

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాటు సారా తయారీపై నిఘా కోసం డ్రోన్లు వినియోగించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణా, వినియోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీతోపాటు నాటుసారా వినియోగం వల్ల వచ్చే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News January 11, 2026
మంచిర్యాల: మేడారం వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్

సమ్మక్క సారాలమ్మ దర్శనానికి మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరేణి కార్మికుడు కుచలరెడ్డి, భార్య, కూతురుతో కలిసి మేడారం జాతరకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని శ్రీరాంపూర్కు తిరిగి వస్తుండగా జైపూర్ మండలం శెట్టిపల్లి వద్ద ప్రమాదవశాత్తు కారు, చెట్టును ఢీకొంది. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
News January 11, 2026
సంగారెడ్డి: 11 మున్సిపాలిటీలకు సమన్వయకర్తల నియామకం

జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలను ప్రకటించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి-రాజనర్సు, సదాశివపేట-సపాన్ దేవ్, జహీరాబాద్-దేవి ప్రసాద్, కోహిర్-ఎంఏ హకీం, జోగిపేట- నరహరి రెడ్డి, ఖేడ్- జైపాల్ రెడ్డి, జిన్నారం-సాయిరాం, గడ్డపోతారం- సోమిరెడ్డి, ఇస్నాపూర్- శ్రీనివాస్, ఇంద్రేశం- అభిలాష్ రావులను నియమించినట్లు చెప్పారు.
News January 11, 2026
NRPT: ‘డయల్ యువర్ ఎస్పీని సద్వినియోగం చేసుకోండి’

సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు బాధితులు 08506-281182 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా వివరించవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.


