News April 14, 2025
సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు.. జూపార్క్ ఓపెన్

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.
Similar News
News February 23, 2026
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ప్రహార్’ పాలసీని ఆవిష్కరించిన కేంద్రం!

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కౌంటర్ టెర్రరిజం పాలసీ ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దుల్లోని జిహాదీ నెట్వర్క్లు, సైబర్ దాడులు, డ్రోన్ ఆధారిత స్మగ్లింగ్, క్రిప్టోకరెన్సీ, జీవ&అణు పదార్థాల దుర్వినియోగం, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ పాలసీని రూపొందించింది. టెర్రర్ దాడులను ఆపేందుకు మల్టీ ఏజెన్సీలను వినియోగించనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయింట్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనుంది.
News February 23, 2026
కరీంనగర్ పోలీస్ డాగ్ ‘టైసన్’కు స్వర్ణ పతకం

కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన పోలీస్ డాగ్ ‘టైసన్’ రాష్ట్ర స్థాయిలో ఘనత చాటింది. హైదరాబాద్ మొయినాబాద్లోని ఐ.ఐ.టి.ఏ (IITA) శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో ఎక్స్ప్లోజివ్ (పేలుడు పదార్థాల గుర్తింపు) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా టైసన్ను, దాని హ్యాండ్లర్ పి.సి. ఇ. రాజును పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.
News February 23, 2026
ఈ ఏడాది రూ.93.64 లక్షల ఖర్చు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో నీటి నిర్వహణ సంస్థ ద్వారా MGNREGS క్రింద ఈ ఏడాదిలో రూ.103 లక్షలతో చేపట్టిన వాటర్షెడ్లు నిర్వహణతో పాటు వివిధ పనులకు సంబంధించి రూ.93.64 లక్షల ఖర్చు చేయడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిపై రోజువారి ఫోటోలు నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. సమయపాలన, నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు.


