News March 29, 2025
సాలూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.
Similar News
News February 25, 2026
అమరావతిలో పర్యటించిన దక్షిణ కొరియా బృందం

జాతీయ యూనివర్సిటీ(దక్షిణ కొరియా) బృందం మంగళవారం అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా రాయపూడిలోని APCRDA కార్యాలయాన్ని బృందం సందర్శించింది. అమరావతి అభివృద్ధి గురించి CRDA అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అమరావతిలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, టూరిజం ప్రాజెక్టులు, విద్య, పరిశోధన అంశాలలో భాగస్వామ్యాలకు ఉన్న విస్తృత అవకాశాలు, అంశాలపై అధికారులు బృందానికి వివరించారు.
News February 25, 2026
TODAY HEADLINES

*YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN
*లడ్డూ తయారీలో 68L కిలోల కల్తీ నెయ్యి వాడారు: Dy.CM పవన్
*AP: దివ్యాంగులకు ఉచిత RTC బస్సు సౌకర్యం: క్యాబినెట్
*నేనూ కుల వివక్షను ఎదుర్కొన్నా: భట్టి
*పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్జీ.. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన
*TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. 5min లేటైనా అనుమతి
*కేరళను ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం
News February 25, 2026
ప్రజారోగ్య రక్షణలో ప్రభుత్వం విఫలం: జగన్

AP: శ్రీకాకుళం <<19230296>>డయేరియా<<>> ఘటనపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్, మురుగునీటి నిర్వహణలో తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


