News March 19, 2025

సాలూరు: గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు

image

గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 15న తోణాం పంచాయతీ మద్దిన వలస గ్రామంలో పొలం గట్టు గొడవలో కోనేటి లక్ష్మణరావు ఆయన భార్య ఝాన్సీలపై దాడి చేసి దూషించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

మల్యాల: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి.. సర్పంచ్ బరిలో నిలిచి

image

ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవకై ముందుకొచ్చారు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మల్యాల మేజర్ GP సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వీరబత్తిని మాలతీ ప్రతాప్ మంగళవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కాగా, మాలతి గతంలో దుబాయ్‌లోని ప్రముఖ సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌లో 18ఏళ్లు ఉద్యోగం చేశారు. ప్రస్తుతం HYDలోని విప్రో సంస్థలో నాలుగేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

News December 3, 2025

ధర్మశాస్తా దర్శనం: ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే?

image

అయ్యప్ప స్వాములు ఇరుముడితో 18 మెట్లు దాటిన తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శిస్తారు. అనంతరం మణి మండపం, మహా గణపతి, సర్పరాజు వద్ద ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత చిన్ముద్ర ధారియైన అయ్యప్ప దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుంటారు. ఆ స్వరూపాన్ని గుండెల్లో నింపుకొని, ఇరుముడిని స్వామికి చూపిస్తారు. నెయ్యభిషేకం చేయిస్తారు. చివరగా మాలికపురత్తమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. <<-se>>#AyyappaMala<<>>

News December 3, 2025

VJA: నేడు సిట్ ముందుకు వైసీపీ నేతల కుమారులు

image

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు నేడు విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. జోగి రాజీవ్, రోహిత్ కుమార్, రాకేశ్, రామ్మోహన్‌కు నోటీసులు అందించారు. ఈ మేరకు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వారు విచారణకు హాజరు కానున్నారు. లాప్‌టాప్‌లోని సమాచారం కోసం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.