News October 20, 2024

సాలూరు: నియోజకవర్గ సమన్వయకర్తలతో మంత్రి సమావేశం

image

సాలూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ సమన్వయకర్తలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం సాలూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ పార్టీ రాష్ట్ర సమావేశంలో జరిగిన విషయాలను తెలిజయేశారు. ఈ నెల 26 తేదిన సీఎం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తారని, నియోజకవర్గంలో కూడా అత్యధికంగా నమోదుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు బంజేదేవ్, పరమేసు, ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

VZM: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

image

ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులతో గురువారం వీసీ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోక్ అదాలత్‌పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

News December 4, 2025

VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

image

విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.

News December 4, 2025

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పరంగా జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కానప్పటికి ఇతర జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అనుమానం ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చన్నారు.