News January 25, 2025
సాలూరు: నేడు మంత్రి సంధ్యారాణి షెడ్యూల్ ఇదే

జిల్లాలో నేడు పార్వతీపురం, మక్కువ మండలాలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్వతీపురం లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో నిర్వహించే జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మక్కువ వెంగళరాయ సాగర్లో చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలిస్తారు.
Similar News
News November 24, 2025
వేములవాడలో ప్రచార రథం వద్ద కొనసాగుతున్న దర్శనాలు

వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆలయం ముందు భాగంలోని ప్రచార రథం వద్ద భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి నిత్య కైంకర్యాలను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించి తరిస్తున్నారు.
News November 24, 2025
శబరిమల యాత్రకు మంథని డిపో నుంచి ప్రత్యేక బస్సు

శబరిమల భక్తుల కోసం మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు DM శ్రావణ్కుమార్ తెలిపారు. వెళ్లేటప్పుడు మంథని-హైదరాబాద్-శ్రీశైలం-మహానంది-కాణిపాకం-పంబ, తిరుగు ప్రయాణంలో మదురై-రామేశ్వరం-తిరుపతి మార్గంగా బస్సు నడుస్తుంది. చార్జీ ₹6900. బార్డర్ ట్యాక్స్, పార్కింగ్ ఫీజులు ప్రయాణికులే చెల్లించాలి. 35 సీట్లు బుక్ చేసిన గ్రూపులకు 5మందికి ఉచిత ప్రయాణం. బుకింగ్కు: 9959225923, 9948671514
News November 24, 2025
జిల్లా కలెక్టరేట్లో రేపు దిశ సమావేశం

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, రేపు ఉదయం 11 గం.కు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలని కోరారు.


