News January 25, 2025

సాలూరు: నేడు మంత్రి సంధ్యారాణి షెడ్యూల్ ఇదే

image

జిల్లాలో నేడు పార్వతీపురం, మక్కువ మండలాలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్వతీపురం లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో నిర్వహించే జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మక్కువ వెంగళరాయ సాగర్‌లో చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలిస్తారు.

Similar News

News November 27, 2025

కాకినాడ: వారిని చూసి జగన్ నేర్చుకోవాలి.. యనమల

image

అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీని చూసి ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలో జగన్ చూసి నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చిన్నపిల్లలయినా బహిష్కరణలకు తావు కాకుండా సభలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రస్తావించారన్నారు. ఎప్పటికైనా జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించడం చేయాలని సూచించారు.

News November 27, 2025

SRCL: మహిళల ఓట్లపైనే అందరి ఆశలు..!

image

GP ఎన్నికల్లో గెలుపు కోసం CONG, BRS మహిళలపైనే ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 170772 మంది పురుషులు, 182559 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11787 అధికంగా ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, ఫ్రీ RTC ప్రయాణం వంటి పథకాల పేరిట CONG ఓట్లు అడగనుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని BRS చూస్తోంది.

News November 27, 2025

సిరిసిల్లలో సర్పంచుల ‘ఏకగ్రీవాల పర్వం’..!

image

సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తండా సర్పంచ్‌గా జవహర్‌లాల్ నాయక్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా ఇవాళ ఉదయం అదే మండలంలోని ‘సర్పంచ్ తండా’కు సర్పంచ్(నరహరి నాయక్‌), ఉప సర్పంచ్(గంగారాం నాయక్‌)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఈ రెండు తండాల్లో తొలి విడత అయిన DEC 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏకగ్రీవం కావడంతో ఇక ఇక్కడ ఎన్నికలు లేనట్లే.