News March 24, 2025
సాలూరు: పార్లమెంట్లో “అరకు కాఫీ స్టాల్’

పార్లమెంట్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.
News December 1, 2025
MHBD: నేటి నుంచి కొత్త వైన్ షాపుల ప్రారంభం

జిల్లాలో 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం మొత్తం 61 వైన్ షాపులకు డ్రా పద్ధతి ద్వారా అధికారులు లైసెన్సులు కేటాయించారు. ఇందులో మహబూబాబాద్-27, తొర్రూర్-22, గూడూరు-12 ఎక్సైజ్ శాఖ పరిధిలో 61 షాపులు నిర్వహిస్తున్నారు. డ్రాలో ఎంపికైన నూతన నిర్వాహకులకు అధికారులు లైసెన్సులు అందజేయడంతో వారు సోమవారం నుండి కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.
News December 1, 2025
మేడారంపై గొంతు విప్పుతారా..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి WGL నుంచి కడియం కావ్య, బలరాం నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా మేడారం జాతర వచ్చే 2 నెలల్లో జరగనుంది. ఇప్పటికే నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల మేర నిధులను కేటాయించింది. మరో పక్క కేంద్రం మేడారంను జాతీయ పండగగా మార్చేందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఈ సీజన్లో గొంతు విప్పి అడిగి ఎండగడితే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది.


