News March 15, 2025
సాలూరు : మున్సిపల్ కమిషనర్ సరెండర్

సాలూరు మున్సిపల్ కమిషనర్ విహెచ్ సత్యనారాయణను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. గురువారం రాత్రి మన్యం జిల్లా కలెక్టర్ నిర్వహించిన జూమ్ మీటింగ్ కమిషనర్ పాల్గొనకపోవడం, మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం తదితర కారణాల వలన సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News November 13, 2025
ECGC లిమిటెడ్లో 30 పోస్టులు

<
News November 13, 2025
మెదక్: భార్యను కత్తితో పొడిచి.. భర్త ఆత్మహత్య

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ (పిటి)కి చెందిన అంగడి శంకర్ (50) రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా మతిస్తిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిన్న సోదరుడి మనుమరాలు భవనం పైనుంచి కింద పడేసినట్లు తెలిపారు. భార్యపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. కుటుంబీకులు ఆసుపత్రికి వెళ్లగా ఇంటి వద్ద ఉన్న శంకర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
News November 13, 2025
ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.


