News January 24, 2025

సాలూరు: ‘సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇవ్వాలి’

image

భూమి సాగు చేస్తున్న దళితులుకు పట్టాలివ్వలని, దళితులుపై దౌర్జన్యం చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సాలూరు మండలం కరాసవలస పరిధిలో గుర్రప్ప వలస రెవెన్యూలో 5 ఎకరాలు సాగు చేస్తున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని పేదల మధ్య తగాదాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 5, 2025

రాజమహేంద్రవరం: 7న ‘శ్రీ షిర్డిసాయి’లో స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

image

పదో తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదివారం మెగా స్కాలర్‌షిప్‌ టెస్ట్‌, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ షిర్డిసాయి విద్యాసంస్థల డైరెక్టర్‌ టి.శ్రీవిద్య తెలిపారు. బీజపురి క్యాంపస్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. జేఈఈ, నీట్‌, సివిల్స్‌ కోర్సులపై నిపుణులు దిశానిర్దేశం చేస్తారని చైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9281030301 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News December 5, 2025

అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి

image

అమెరికాలోని బర్మింగ్‌హోమ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అలబామా యూనివర్సిటీలో చదివే 10 మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News December 5, 2025

మంత్రి పొంగులేటి స్వగ్రామం నారాయణపురంలో ఏకగ్రీవం

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమన్వయంతో గ్రామ పెద్దలు ఏకాభిప్రాయం సాధించారు. తన స్వగ్రామం ఏకగ్రీవం కావడంతో మంత్రి అభినందనలు తెలిపారు.