News January 24, 2025
సాలూరు: ‘సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇవ్వాలి’

భూమి సాగు చేస్తున్న దళితులుకు పట్టాలివ్వలని, దళితులుపై దౌర్జన్యం చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సాలూరు మండలం కరాసవలస పరిధిలో గుర్రప్ప వలస రెవెన్యూలో 5 ఎకరాలు సాగు చేస్తున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని పేదల మధ్య తగాదాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 2, 2025
ఖమ్మం: తొలిరోజే రూ.33 కోట్ల మద్యం విక్రయాలు

2025–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 204 వైన్ షాపుల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే వైరా ఐఎంఎల్ డిపో నుంచి ఏకంగా రూ.33 కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. ఇందులో 38,685 మద్యం కేసులు, 17,298 బీరు కేసులు ఉన్నాయి. నెల రోజులుగా బ్రాండ్లు లేక ఇబ్బంది పడిన మద్యం ప్రియులకు అన్ని రకాలు అందుబాటులోకి వచ్చాయి.
News December 2, 2025
తిరిగి విధుల్లోకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్స్ తీసుకున్న ఆయన సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నట్లు ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News December 2, 2025
ఖమ్మం: చెక్ బౌన్స్.. ఏడాది జైలు, రూ.19 లక్షల పరిహారం

ఖమ్మం నర్తకి థియేటర్ ప్రాంతానికి చెందిన ఎ.రవిబాబుకి చెల్లని చెక్కు కేసులో ఖమ్మం రెండో అదనపు కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారుడికి రూ.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. 2014లో రూ.15 లక్షల అప్పు తీసుకున్న నిందితుడు, 2016లో రూ.19 లక్షల చెక్కు జారీ చేయగా ఖాతాలో సరైన నగదు లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చారు.


