News March 24, 2025
సాలూర: చెరువులో పడి యువకుడు మృతి

సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన మోతేవార్ రమేశ్(26) చెరువులో పడి మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డ వివరాలు.. రమేశ్ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్తుండగా మార్గమధ్యంలో కాలకృత్యాలు చేసుకొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News March 30, 2025
NZB: జిల్లాలో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం ధర్పల్లి, మంచిప్పలో అత్యధికంగా 41.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేంపల్లి, కోటగిరిలో 40.9, వేల్పూర్, చింతకుంటలో 40.8, పెర్కిట్ 40.7, తొండకూర్, ఇస్సాపల్లి 40.4, మెండోరా, లక్ష్మాపూర్ 40.3, బాల్కొండ 40.2, ఆలూరు, మాచర్ల, ముప్కాల్లో 40.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికీ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News March 30, 2025
NZB: కరాటే విజేతలకు బహుమతులు అందజేసిన టీపీసీసీ చీఫ్

కరాటే పోటీల విజేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 4 రోజుల పాటు జరిగిన కరాటే పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ యూనివర్సిటీ యువతకు, క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనిబాల, కరాటే ఇండియా అధ్యక్షుడు భారత్ శర్మ పాల్గొన్నారు.
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.