News February 17, 2025
సాలెగూడలో ఐదుగురిపై కేసు

ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురు జూదరులను పట్టుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. వారి వద్ద రూ.3,020 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 3, 2025
వికారాబాద్: ఉప సర్పంచి ఐతే పోలా

గ్రామాల్లో కొందరు సర్పంచి అవుదామంటే రిజర్వేషన్లు, ఇతర పరిస్థితులు అనుకూలించక వార్డు సభ్యుడితో సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అనుకూలంగా మార్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. వార్డు సభ్యులుగా నామినేషన్ వేసి గ్రామ పంచాయతీలోకి అడుగుపెట్టాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ వర్గం లేదా పార్టీకి అనుకూలమైన వారిని గెలిపించుకుంటే ఉప సర్పంచి పదవి తనదేనని ప్రచారం ప్రారంభించారు.
News December 3, 2025
WNP: వాహనం అదుపుతప్పి.. వ్యక్తి మృతి

అమరచింత మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న కడుమూరు గ్రామానికి చెందిన రాజు (45) అమరచింత నుంచి చిన్న కడుమూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు అతణ్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 3, 2025
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

జె.పంగులూరు మండలం చందలూరులో బుధవారం రైతన్నా మీకోసం వారోత్సవాలు నిర్వహించారు. ఈ వర్క్షాప్లో బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.


