News March 14, 2025
సింగరకొండ దేవాలయ స్పెషాలిటీ ఇదే..!

అద్దంకి – సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇదొక్కటే ఉంది. ఈ దేవాలయం 1960 నుంచి దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.
Similar News
News December 3, 2025
రైతన్న మీకోసం వర్క్ షాప్లో కలెక్టర్

పెదపాడు మండలం అప్పన్నవీడులో బుధవారం రైతన్న మీకోసం వర్క్షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు.
News December 3, 2025
ఈనెల 5న డివిజన్ల వారీగా ఎన్నికల శిక్షణ: కలెక్టర్ ప్రావీణ్య

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 5వ తేదీన డివిజన్ల వారీగా ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి, ఆందోల్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె చెప్పారు. గతంలో శిక్షణకు హాజరుకాని ఉద్యోగులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.
News December 3, 2025
TPT: దూరవిద్య పీజీ ఫలితాల విడుదల

తిరుపతి శ్రీ వేంకటేశ్వర దూరవిద్య విభాగం పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పీజీ (PG) పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చివరి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.


