News April 24, 2024
సింగరాయకొండ బస్టాండ్లో రూ.5లక్షలు స్వాధీనం

సింగరాయకొండ బస్టాండ్లో సోమవారం భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో బస్టాండు సెంటర్లోని లగేజీ సెంటర్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ప్రయాణికుడి వద్ద రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 23, 2025
వీరయ్య చౌదరికి CM నివాళి

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి CM చంద్రబాబు చేరుకున్నారు. వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
News April 23, 2025
అలకూరపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థినికి 595 మార్కులు

టంగుటూరు మండలంలోని అలకూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 600 గాను 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యశాఖధికారులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News April 23, 2025
10th RESULTS: 9వ స్థానంలో ప్రకాశం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లా 85.43%తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. మొత్తం 29,386 మంది పరీక్షలు రాయగా 25,103 మంది పాసయ్యారు. 14,880 బాలురులో 12,480 మంది, 14,506 మంది బాలికలు పరీక్ష రాయగా 12,623 మంది పాసయ్యారు.