News December 12, 2024

సింగరాయకొండ: 800 మందిని మోసం చేసిన కి‘లేడీ’

image

మండలంలోని ఉలవపాడుకు చెందిన కామంచి కోటి అనే వ్యక్తి నందిని పొదుపు సంస్థను ప్రారంభించారు. ఈ పొదుపు సంఘాల్లో సింగరాయకొండకు చెందిన పలువురిని చేర్చుకొని 800 మంది చేత రూ.50 లక్షల వరకు కట్టించాడు. కోటి మరణించగా.. అతని భార్య నందిని పొదుపు సంస్థను నడుపుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా సంస్థను మూసివేయడంతో డబ్బులు కట్టిన వారు మోసపోయామని గ్రహించి న్యాయం కోసం సింగరాయకొండ ఎస్సై మహేంద్ర వద్దకు చేరారు.

Similar News

News January 16, 2025

పాకల ఘటన దురదృష్టకరం: S.P ఏ.ఆర్ దామోదర్

image

పాకల బీచ్‌లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న జిల్లా S.P ఏ.ఆర్ దామోదర్, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బీచ్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుడు మాధవ సతీమణి నవ్య (21)ను సురక్షితంగా కాపాడగలిగామని S.P తెలియజేశారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

News January 16, 2025

ఏపీఐఐసీ ఎండీ టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్

image

ఇండస్ట్రియల్ నోడ్స్ అభివృద్ధికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం మంగళగిరి నుంచి ఆయనడి జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌గా సమావేశమై ఇండస్ట్రియల్ నోడ్స్ అభివృద్ధికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పై జిల్లాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ పాల్గొన్నారు.

News January 16, 2025

అధికారులకు ప్రకాశం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.