News May 24, 2024
సింగరేణిలో ఆస్ట్రేలియా సాంకేతికతపై చర్చలు

సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సంస్థ C&MD బలరాం పేర్కొన్నారు. ఈ మేరకు HYD సింగరేణి భవన్లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంపై ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డేనిస్ ఈటెన్తో ప్రత్యేక సమావేశమయ్యారు. సింగరేణిలో నూతన వ్యాపార విస్తరణ చర్యల పరిశీలనకు నవంబర్లో ఆస్ట్రేలియా బృందం పరిశీలిస్తుందన్నారు.
Similar News
News February 14, 2025
కరీంనగర్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా విధులకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, అందువల్ల ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు.
News February 13, 2025
జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.
News February 13, 2025
కరీంనగర్: సఖి సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి కేంద్రం, మహిళా సాధికారత విభాగం సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సఖి కేంద్రం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మేనేజ్మెంట్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సఖి సేవలను గురించి అందరికీ తెలిసేలా ప్రజలు సందర్శించే స్థలాల్లో, కలెక్టరేట్ ప్రాంగణంలో బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.