News February 18, 2025
సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ

సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న జీఎంలు, అడిషనల్ జీఎంలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియాకు, జీఎం కార్పొరేట్ ఎం.విజయభాస్కర్ బెల్లంపల్లికి, జైపూర్ ఎస్టీపీపీ జీఎం ఎన్వీ.రాజశేఖర్ రావు జీఎం (మార్కెటింగ్), మందమర్రి ఏరియాలోని కేకే గ్రూప్ అడిషనల్ జీఎం వి.రామదాసును జీఎం(కార్పొరేట్)కు బదిలీ అయ్యారు.
Similar News
News February 26, 2026
‘యూత్ పార్లమెంట్’ పోస్టర్ను ఆవిష్కరించిన బండి సంజయ్

వికసిత్ భారత్ 2026 జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీల పోస్టర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ నెల 28న ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ’50 ఏళ్ల ఎమర్జెన్సీ, భారత ప్రజాస్వామ్య పాఠాలు’ అంశంపై 18-25 ఏళ్ల యువతకు పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు ‘మై భారత్’ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, విద్యార్థులు తమ గళాన్ని జాతీయ స్థాయి వరకు వినిపించాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
News February 26, 2026
జగిత్యాల: గంజాయి కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

జగిత్యాల జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, విక్రయానికి పాల్పడిన మెస్రాం నాగనాథ్కు గౌరవ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి ఎస్. నారాయణ 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. రాయికల్లో 1.5 కిలోల ఎండు గంజాయితో పట్టుబడిన నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 26, 2026
కడప: ఇవాళ పరీక్షకు 466 మంది గైర్హాజర్.!

కడప జిల్లాలో గురువారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ ఇంగ్లిష్ పరీక్షలు జరిగాయి. నేడు 16,861 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 16,395 మంది మాత్రమే రాశారు. 466 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 15,792 మంది రాయాల్సి ఉండగా.. 15,300 మంది రాశారు. 402 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,159 మంది రాయాల్సి ఉండగా.. 1,095 మంది రాశారు. 64 మంది రాయలేదు.


