News February 18, 2025

సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ

image

సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న జీఎంలు, అడిషనల్ జీఎంలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియాకు, జీఎం కార్పొరేట్ ఎం.విజయభాస్కర్ బెల్లంపల్లికి, జైపూర్ ఎస్టీపీపీ జీఎం ఎన్వీ.రాజశేఖర్ రావు జీఎం (మార్కెటింగ్), మందమర్రి ఏరియాలోని కేకే గ్రూప్ అడిషనల్ జీఎం వి.రామదాసును జీఎం(కార్పొరేట్)కు బదిలీ అయ్యారు.

Similar News

News March 26, 2025

‘పవన్ అన్న నువ్వు పిఠాపురం రా..!’

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు. ఆయన వచ్చాక పిఠాపురం దశ దిశ మారతాయని ఎంతో ఆత్రుతగా ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గిన తర్వాత పవన్ పిఠాపురానికి రావడం చాలా తక్కువే. ఏదో కార్యక్రమంలో ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి, పవన్ అన్న నువ్వు పిఠాపురం రా అని ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు.

News March 26, 2025

కార్వేటి నగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

బొలెరో వాహనం ఢీకొని కార్వేటి నగరం మండలానికి చెందిన యువకుడు మంగళవారం మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. కేపీ అగ్రహారానికి చెందిన రవి(26) తిరుపతిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైకుపై వస్తుండగా వెదురుకుప్ప మండలం చిన్నపోడు చేను సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 26, 2025

NIRMAL: KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

error: Content is protected !!