News February 10, 2025
సింగరేణి ఇంటర్వ్యూకు బెల్లంపల్లి రీజియన్ అధికారులు

సింగరేణి సంస్థల డైరెక్టర్లు (P& P), డైరెక్టర్(ఆపరేషన్)పోస్టుల ఎంపికకు రంగం సిద్ధమైంది. డైరెక్టర్ల ఎంపిక కోసం పలువురు GMలకు ప్రభుత్వం, CMDబలరాం నాయక్ నుంచి పిలుపు వచ్చింది. బెల్లంపల్లి రీజియన్లో పనిచేస్తున్న శ్రీరాంపూర్ GM సూర్యనారాయణ, మందమర్రి GM దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్కు సోమవారం మధ్యాహ్నం ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది.
Similar News
News October 18, 2025
విశాఖకు గూగుల్ రాక శుభపరిణామం: ఎంపీ శబరి

గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్కు శుభసంకేతమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలను హైదరాబాదుకు ఆహ్వానించిన చంద్రబాబు ఇప్పుడు నవ్యాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు.
News October 18, 2025
వివాహిత అదృశ్యం కేసు పై హైకోర్టు సీరియస్

తాడేపల్లిగూడెం (M) దండగర్రకు చెందిన వివాహిత మహిళ మంగాదేవి అదృశ్యం కేసు విచారణలో హైకోర్టు సీరియస్ అయింది. మహిళ తండ్రి బండారు ప్రకాశరావు 2017లో కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. వివాహిత భర్త బ్రహ్మాజీని ఐదేళ్ల తర్వాత విచారించడం పై హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు పురోగతి తెలియజేయాలంటూ పోలీసులకు ఆదేశిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
News October 18, 2025
HYD: జిమ్లలో ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ దుర్వినియోగంపై చర్యలు

సికింద్రాబాద్లోని నామాలగుండులో అక్రమంగా నిల్వచేసి విక్రయించిన ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ నిల్వలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.నరేశ్ అనే మెడికల్ వ్యాపారి నుంచి గుండె ఉద్దీపన మందులు-టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీబిల్డింగ్లో దుర్వినియోగం కోసం ఈ మందులను జిమ్కు వెళ్లేవారికి చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు.