News December 23, 2024

సింగరేణి వేడుకలకు ముస్తాబైన స్టేడియం

image

సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను అందంగా ముస్తాబు చేశారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు GM లలిత కుమార్ తెలిపారు. సింగరేణి జెండా ఆవిష్కరణ, స్టాల్స్ ఏర్పాట్లను జీఎంతో పాటు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి కుటుంబాలు, స్థానికులు హాజరు కావాలన్నారు. 

Similar News

News January 14, 2025

GDK: ఇలాగైతే ప్రమాదాలు జరగవా!

image

గోదావరిఖని మాతంగి కాంప్లెక్స్ రోడ్డుపై ఓ పక్క రోడ్డు కుంగిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇటీవల రోడ్డుపై గుంత ఏర్పడి, క్రమక్రమంగా అది పెద్దగా అవుతుండటంతో గుర్తించేందుకు వీలుగా స్థానికులు దానికో గుడ్డ పీలిక చుట్టారు. ఇదంతా అధికారులు చూస్తున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

News January 14, 2025

KNR: ముగ్గులతో మొదలైన సంక్రాంతి సంబురాలు!

image

KNR ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండుగ మొదలైంది. జిల్లాలో మహిళలు, ఆడపడుచులు ఉదయాన్నే 4 గంటలకు లేచి వాకిట్లో ముగ్గులు, రంగవల్లులతో పోటీపడ్డారు. తదనంతరం స్నానాలు ఆచరించి గోబ్బేమ్మలు, ధాన్యలతో, రేగిపండ్లతో ముగ్గులను అలంకరించి చిన్నపిల్లలకు బడబుడకలతో దిష్టిని తీశారు. దీంతో ఉదయం ముగ్గులతో పండుగ మొదలుకొని సాయంత్రం వరకు కొత్త అల్లుళ్ల దావత్లు, తీపి వంటకాలతో పండుగను జరుపుకుంటారు.

News January 14, 2025

పెద్దపల్లి: హాస్టల్‌కు వెళ్లమన్నందుకు ఉరేసుకున్నాడు

image

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌(M) కూనారం వాసి ప్రసన్నకుమార్ HNKలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తాను హాస్టల్‌కు వెళ్లనని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు మందలించగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.