News July 4, 2024

సింహగిరి ప్రదక్షణ అధికారులతో సమీక్షించిన కమిషనర్

image

ఈ నెల 20,21 వ తేదీలలో జరుగనున్న శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత ఈ రోజు నగర పోలీసు కమీషనర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు రివ్యూ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన పలు గిరి ప్రదక్షిణ బందోబస్తు ఏర్పాట్లను వీడియోల ద్వారా పరిశీలించారు. దారి పొడవునా వీధి దీపాలు ఏర్పాటు, సముద్ర స్నానాల్లో భద్రత చర్యలు తదితర అంశాలపై చర్చించారు.

Similar News

News December 9, 2025

విశాఖలో సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

image

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను కలెక్టర్‌ హరేంధిర ప్ర‌సాద్ మంగళవారం ప‌రిశీలించారు. మ‌ధురువాడ ఐటీ హిల్స్‌పై సంద‌ర్శించిన ఆయ‌న కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాప‌న చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్ర‌మంలో అక్క‌డి హెలిప్యాడ్‌ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.

News December 9, 2025

విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

image

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్‌ను వినియోగించుకోవాలన్నారు.

News December 9, 2025

విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

image

CM చంద్రబాబు ఈనెల 12న‌ విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.