News May 29, 2024

సింహాచలంలో నేత్ర పర్వంగా అప్పన్న నిత్య కల్యాణం

image

సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

Similar News

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News September 30, 2024

విజయనగరం ఉత్సవాల్లో 12 చోట్ల వినోద కార్యక్రమాలు

image

అక్టోబర్ 13, 14 తేదీలలో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాల్లో 12 ప్రధాన వేదికల వద్ద వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. వేదికల వద్ద జిల్లా అధికారులను ఇన్ ఛార్జ్‌లుగా నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమాల పట్ల వారి ఆసక్తి తగ్గట్టుగా సుమారు 50 మంది లైఫ్ మెంబర్లను ప్రతి వేదిక వద్ద సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు.

News September 30, 2024

లేజ‌ర్ షో ద్వారా విజయనగరం చరిత్ర

image

కోట గోడపై అన్నివైపులా లైటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. కోట చుట్టూ వున్న కంద‌కాల‌ను స్వ‌చ్ఛ‌మైన నీటితో నింపి లాన్‌తో అందంగా తీర్చిదిద్దాల‌న్నారు. కోట గోడ‌ను ఆనుకొని వెన‌క‌వైపు ఉన్న ఖాళీ స్థ‌లంలో సంద‌ర్శ‌కులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కోట‌కు ద‌క్షిణం వైపు ప్ర‌తిరోజూ లైట్ అండ్ షో నిర్వ‌హించి విజ‌య‌న‌గ‌రం చ‌రిత్ర‌, వైభ‌వాన్ని లేజ‌ర్ షో ప్రదర్శిస్తారు.