News June 18, 2024

సింహాచలంలో 6 గంటల వరకే అప్పన్న దర్శనాలు

image

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు నేడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News October 4, 2024

విజయనగరం: TODAY TOP NEWS

image

➣ రామతీర్థంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➣ భోగాపురం: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
➣ గజపతినగరం: పాముకాటుతో రైతు మృతి
➣ పైడితల్లమ్మ హుండీల్లో నకిలీ నోట్లు
➣ 151 నుంచి 11 సీట్లుకు దిగిపోయారు: కిమిడి నాగార్జున
➣ పొలాల్లోకి దూసుకెళ్లిన విజయనగరం- రాజాం BUS
➣ ఒమ్మిలో పసుపు కొమ్ములతో అమ్మవారి విగ్రహం
➣ పార్వతీపురం జిల్లాలో 7,83,972 మంది ఓటర్లు

News October 3, 2024

VZM: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

భోగాపురం పోలీస్ స్టేషన్ లో 2021లో నమోదైన హత్య కేసు నిందితుడికి జిల్లా మహిళ కోర్టు జీవిత ఖైదు, రూ. 2,500 జరిమానా విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కొంగవానిపాలెంకు చెందిన గోవింద మద్యం మత్తులో భార్య మంగమ్మను హత్య చేశాడని, మృతిరాలి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామన్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారైందని చెప్పారు.

News October 3, 2024

సాలూరు- విశాఖ వయా బొబ్బిలి.. రేపే ట్రైల్ రన్

image

కొన్నేళ్ల నుంచి ట్రైన్ సాలూరు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 12.30కు బొబ్బిలి 1.10 కి సాలూరు చేరుకుని తిరుగు ప్రయాణమై సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రైల్వే అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.