News April 25, 2024

సింహాచలం ఆలయ ప్రాంగణంలో వినోదాత్మక సన్నివేశం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం వినోదాత్మక సన్నివేశం జరిగింది. సింహాద్రి అప్పన్న ఉంగరం పోయింది.. ఎవరు తీశారంటూ.. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంటల శ్రీనుబాబుతో పాటు పలువురు భక్తులను విచారించారు. కొందరు భక్తులు ఇది నిజమేననుకుని కంగారుపడ్డారు. చివరకు పట్టు వస్త్రాల్లో దొరికిందని ఆలయ అర్చకులు ప్రకటించారు.

Similar News

News December 8, 2025

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్‌లో కూరగాయలు

image

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.